నిద్ర - నియమాలు

 

      మానవుడు ఆరోగ్యముగా ఉండవలెను అనిన ఆహారం మరియు నిద్ర ఇవి రెండు ముఖ్యమైనవి . నిద్ర వలన శ్రమ , అలసట తొలగిపోవును . నిద్ర సరిగ్గా పోనిచో శరీరం అశక్తతో నీరసంగా తయారగును. ముఖ్యంగా చిన్నపిల్లలకు , వృద్దులకు నిద్ర అత్యంత ముఖ్యం అయినది. ప్రతిమనిషి 5 గంటల నుంచి 8 గంటలపాటు తప్పకుండా నిద్రించవలెను. నిద్రను రెండురకాలుగా విభజించవచ్చు. అవి 

              1 . గాఢనిద్ర.

              2 . కలతనిద్ర .

గాడనిద్ర  -

       మైమరచి , బాహ్య విషయాలు తెలియకుండా రెండు నుంచి మూడు గంటల పాటు నిద్రించుట . దీనివల్ల మానసికపరమైన ఉల్లాసం , విశ్రాంతి లభించి మానవుడు దైనందిక కార్యక్రమాలు చురుకుగా నిర్వర్తించగలడు.

కలతనిద్ర  -

        మనుష్యుడు నిద్రించునప్పుడు కొంతవరకు బాహ్యవిషయాలు తెలియుచుండును. ఎవరైనా బిగ్గరగా మాట్లాడటం , శబ్దము చేసిన వెంటనే మెలుకువ వచ్చును. ఈ నిద్ర వలన పూర్తి విశ్రాంతి కలుగదు. కొంతవరకు శారీరక విశ్రాంతి మాత్రం లభించును.

నిద్ర నియమాలు  -

*  కొన్నాళ్ళు జబ్బు పడి లేచినవారు , జ్వరముతో బాధపడువారు , నిద్రవచ్చినప్పుడు కునికిపాట్లు పడవచ్చు కాని పూర్తిగా నిద్రపోగూడదు అని ఆయుర్వేదం స్పష్టంగా చెప్పినది.

*  జ్వరంతో ఉన్నప్పుడు ఆహారం తీసుకుని మరలా నిద్రించినచో జ్వరం వెంటనే తిరగబెట్టును. కావున వైద్యుడు చెప్పిన నియమాల ప్రకారమే నిద్రించవలెను.

*  ఎదైనా పరిస్థితులలో రాత్రి జాగరణ చేసినచో రాత్రి ఎంతకాలం నిద్ర తగ్గినదో అంత సమయంలో సగభాగం ఉదయాన్నే ఆహారం తీసుకొకుండా నిద్రించవలెను.

*  ఏప్రిల్ మరియు మే నెలలలో అనగా గ్రీష్మఋతువు నందు ఎండలు అధికంగా పగలు నిద్రించుట పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఆరోగ్యం కలిగించును.

*  సాయంత్రం సమయంలో టీ మరియు కాఫీని తాగడం ఆపినచో రాత్రి సమయం నందు చక్కటి నిద్రపట్టును .

*  ఎక్కువుగా పొగ తాగేవారికి నిద్రపట్టదు. పొగలోని నికోటిన్ అంటూ విషపదార్థం శరీరంలోని నరములకు ఉత్తేజం కలిగించి నిద్రను రానివ్వదు.

*  నిద్రించుటకు ముందు ఆలోచనలను దూరం పెట్టి ప్రశాంతంగా ఉండి వెలికిలిగా పడుకొని ధ్యానం చేయుట ద్వారా మంచి నిద్రపట్టును . మధ్యలో మెలకువ వచ్చిన ఎడమ చేతి వైపు తిరిగి పడుకోవలెను .

*  పొలం పనిచేయువారు మరియు ఫ్యాక్టరీ పనిచేయువారు సాయం సమయాన గోరువెచ్చని నీటితో స్నానం చేసి 10 గంటల లోపు నిద్రకు ఉపక్రమించవలెను.

*  శారీరక శ్రమ లేనివారు చన్నీటి స్నానము చేయవచ్చు . గదిలో తక్కువకాంతి ఇచ్చే బల్బ్ లను ఉంచరాదు.

*  ఉదయం నిద్రలేచే ముందు మంచం పైన అటూఇటూ నాలుగు నుంచి అయిదు సార్లూ పొర్లి చేతులు , కాళ్లు విదల్చవలెను.

*  నిద్ర లేచించిన వెంటనే కాళ్లు , చేతులు వేళ్లు మెటికలు విరవడం వలన శరీర అవయవాలు శక్తిని పుంజుకోనును.



   గమనిక  -

       నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషదాలు " అనే గ్రంథం నందు పెద్ద పెద్ద రోగాలకు కూడా అత్యంత సులభ చిట్కాలతో నయం చేసుకునే విధముగా ఇవ్వడం జరిగింది.  రోగ కారణాలు , ఔషధాలు , పత్యాలు అన్ని ఒకేచోట ఇచ్చాను.

           ఈ గ్రంథంలో అన్ని వైద్య యోగాలు ఇంట్లో ఉన్న వస్తువులు మరియు ఇంటి చుట్టుపక్కల దొరికే మూలికలతో సొంతంగా ఇంట్లొనే తయారుచేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది. మొక్కలను సులభంగా గుర్తించుటకు రంగుల ఫొటోస్ ఇచ్చాను. ఆయుర్వేదం పైన అవగాహన ఏర్పరచుకోవాలి మరియు ఆయుర్వేదం నేర్చుకునే వారికి చక్కటి మార్గ సూచీ అవుతుంది. గ్రాంధిక భాష కాకుండా మనం వాడే సాధారణ భాష లో ఉంటుంది.

        చెట్లను బట్టి భూమి యందు నీటిని కనుగొనే విధానం , వ్యవసాయంలో అధిక ఫలితాలు సాధించుటకు వృక్షాయుర్వేదం అను ప్రాచీన రహస్య యోగాలు గురించి , పశువుల వైద్య యోగాలు వంటి ఎన్నో అమూల్యమయిన విషయాలు తెలియచేశాను . గ్రంథం మొత్తం 288 పేజీలు ఉంటుంది. ఈ అమూల్య గ్రంథం విలువ 350 రూపాయిలు మాత్రమే .

    కేవలం ఆరు నెలలోపే ద్వితీయ ముద్రణ కు వచ్చిన ఈ గ్రంథం కావలసిన వారు డైరెక్టుగా మాత్రమే సంప్రదించగలరు. గత 250 సంవత్సరాల నుంచి మా వంశపారంపర్యంగా వచ్చిన అనుభవ రహస్య వైద్య యోగాలు ఈ గ్రంథంలో సంపూర్ణంగా వివరించాను.

   ఈ గ్రంథం కావలసిన వారు డైరెక్టుగా ఫొన్ ద్వారా మాత్రమే సంప్రదించగలరు.  సంప్రదించవలసిన నెంబర్

                      9885030034 

 
                కాళహస్తి వెంకటేశ్వరావు

            అనువంశిక ఆయుర్వేద వైద్యం

                      9885030034

Comments

Popular posts from this blog

మంత్రశక్తి గురించి వివరణ - మంత్రసిద్ధి

సొంటి చేసే మేలు

ఉప్పుకు ప్రత్యామ్నాయం సైన్డవలవనం