చరకమహర్షి గర్భము మరియు గర్భలక్షణాల గురించి ఇచ్చిన వివరణ
ఆయుర్వేద వైద్యులలో అగ్రగణ్యుడు చరకుడు . ఈయన మానవాళికి అందించిన అత్యద్భుత గ్రంథం " చరకసంహిత "
ఈ గ్రంథం 7 స్థానములతో అత్యద్భుతంగా లిఖించబడినది. అవి
* నిదానస్థానం .
* విమానస్థానం .
* శారీరస్థానం
* ఇంద్రియస్థానం .
* కల్పస్థానం .
* సిద్ధిస్థానం .
* చికిత్సాస్థానం .
సూత్రస్థానం అనునది కూడా వీటిలో కలిసే ఉంటుంది. ఇందులో మీకు ఈ రోజు శారీరస్థానం గురించి వివరిస్తాను . ఈ శారీరస్థానంలో గర్భం అది ఏర్పడేవిధానం గురించి చాలా అత్యద్బుతంగా చరకుడు వివరించాడు .
గర్బం ఏర్పడేవిధానం -
పరిశుభ్రమైన శుక్రం కలిగిన పురుషునకు పరిశుద్ధముగా ఉన్నటువంటి స్త్రీ యొక్క ఆర్తవం ప్రశస్తమైన ఋతుకాలం నందు సంయోగం చెంది ఎప్పుడు జీవుడు మనోగమనం పొందునో అప్పుడు గర్బం ఏర్పడును .
పిండమునకు ఎవరివలన యే విధమైన అవయవములు సంప్రాప్తినించును -
గర్బము తల్లివలన ఏర్పడును . గర్భస్థశిశువుకు తల్లి వలన చర్మము , రక్తము , మాంసము , మేధస్సు , నాభి , హృదయము , క్లోమము , కాలేయము , ప్లీహము , మూత్రపిండాలు , వస్తి , పురీషాశయం , ఆమాశయం , పక్వాశయం , గుద ప్రదేశం యొక్క ఊర్ధ్వ, అదో భాగములు చిన్నప్రేగులు , పెద్దప్రేగులు .
ఇవన్ని తల్లివలన గర్భస్థ పిండముకు సంక్రమించును.
గర్బము తండ్రివలన కలుగును. కేశములు , మీసములు , గోళ్లు , రోమములు దంతములు , ఎముకలు , సిరలు , స్నాయువులు , ధమనులు , శుక్రము అనునవి తండ్రి వలన కలుగును.
పిండము ఆడ, మగ అనేవి నిర్ణయం జరుగు విధము -
మగవాడి యొక్క శుక్రం , స్త్రీ యొక్క ఆర్తవం కలిసినప్పుడు స్త్రీ యొక్క ఆర్తవం అధికంగా ఉండి మగవాని యొక్క శుక్రం తక్కువుగా ఉన్నచో వారికి తప్పకుండా ఆడ సంతానమే జనియించును.. అదేవిధంగా మగవాని శుక్రం ఎక్కువుగా ఉండి స్త్రీ యొక్క ఆర్తవం తక్కువుగా ఉన్నచో వారికి జనియించు సంతానం మగబిడ్డ అగును. శుక్రశోణిత సంయోగం నందు ఒక భాగం నందు ఆర్తవం ఒక భాగం నందు శుక్రం అధికం ఉండునట్లు శుక్రశోణితం రెండు భాగాలుగా విభజింపబడినచో ఒక ఆడ ,ఒక మగ సంతానం కలుగును. శుక్రం ఎక్కువుగా గల శుక్రశోణితం రెండు భాగాలుగా విభజన చెందినచో ఆ స్త్రీకి ఇద్దరు పుత్రులు జనియించెదరు . కొంతమందికి ఈ శుక్రశోణితం అనేక భాగాలుగా విభజన చెందును. దీనివలన ఒకేసారి అనేక మంది సంతానం జనియించును . ఇది కర్మవశమున జరుగును.
లక్షణాలని బట్టి పిండము ఆడ లేదా మగ అని తెలుసుకొనుట -
* నోట నీరుకారుట.
* శరీరం బరువుగా ఉండటం.
* శరీరం కృశించుట .
* బడలిక.
* ఉత్సాహం లేకుండా ఉండటం.
* హృదయము నందు భాధ .
* తృప్తిగా ఉండటం.
పైన చెప్పినవన్నీ మంచి గర్భమును సూచించు లక్షణాలు.
* ఎడమవైపు గల అవయవాలతో పనులు ఎక్కువ చేయుట .
* గర్బము పొడుగు పెరుగుట.
* ఎడమస్థనము నందు పాలు ఎక్కువుగా ఉత్పత్తి అగుట.
ఈ పై లక్షణములు కలిగిన స్త్రీ తప్పక ఆడ శిశువుని ప్రసవించును. ఈ లక్షణములు కు వ్యతిరేక లక్షణములు కలిగియున్నచో
మగశిశువు జనియించును . ఈ రెండు లక్షణములు కలిగియున్నచో నపుంసకుడు జనియించును .
గర్భము కలుగు సమయమున స్త్రీ తన మనస్సు నందు ఎట్టి రూపమును తలచునో అట్టి రూపము గల సంతానం జనియించును . పూర్వజన్మ కర్మ వలన కూడా రూపం సంప్రాప్తించును.
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషదాలు " అనే గ్రంథం నందు పెద్ద పెద్ద రోగాలకు కూడా అత్యంత సులభ చిట్కాలతో నయం చేసుకునే విధముగా ఇవ్వడం జరిగింది. రోగ కారణాలు , ఔషధాలు , పత్యాలు అన్ని ఒకేచోట ఇచ్చాను.
ఈ గ్రంథంలో అన్ని వైద్య యోగాలు ఇంట్లో ఉన్న వస్తువులు మరియు ఇంటి చుట్టుపక్కల దొరికే మూలికలతో సొంతంగా ఇంట్లొనే తయారుచేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది. మొక్కలను సులభంగా గుర్తించుటకు రంగుల ఫొటోస్ ఇచ్చాను. ఆయుర్వేదం పైన అవగాహన ఏర్పరచుకోవాలి మరియు ఆయుర్వేదం నేర్చుకునే వారికి చక్కటి మార్గ సూచీ అవుతుంది. గ్రాంధిక భాష కాకుండా మనం వాడే సాధారణ భాష లో ఉంటుంది.
చెట్లను బట్టి భూమి యందు నీటిని కనుగొనే విధానం , వ్యవసాయంలో అధిక ఫలితాలు సాధించుటకు వృక్షాయుర్వేదం అను ప్రాచీన రహస్య యోగాలు గురించి , పశువుల వైద్య యోగాలు వంటి ఎన్నో అమూల్యమయిన విషయాలు తెలియచేశాను . గ్రంథం మొత్తం 288 పేజీలు ఉంటుంది. ఈ అమూల్య గ్రంథం విలువ 350 రూపాయిలు మాత్రమే .
కేవలం ఆరు నెలలోపే ద్వితీయ ముద్రణ కు వచ్చిన ఈ గ్రంథం కావలసిన వారు డైరెక్టుగా మాత్రమే సంప్రదించగలరు. గత 250 సంవత్సరాల నుంచి మా వంశపారంపర్యంగా వచ్చిన అనుభవ రహస్య వైద్య యోగాలు ఈ గ్రంథంలో సంపూర్ణంగా వివరించాను.
ఈ గ్రంథం కావలసిన వారు డైరెక్టుగా ఫొన్ ద్వారా మాత్రమే సంప్రదించగలరు. సంప్రదించవలసిన నెంబర్
9885030034
కాళహస్తి వెంకటేశ్వరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యం
9885030034
Comments
Post a Comment