Posts

బ్రహ్మవిద్యలో మానస పూజా విధానం

Image
   మానసపూజ : ఈశ్వర ఉవాచ- మానస పూజచే కల్గుమహిమలు, అద్భుతములు, ఏమనిచెప్పను, ఏక ధ్యానములేదు, అంగన్యాస, కరన్యాసకరతంత్రములు చేసే అవసరంలేదు, చక్కగా ను స్నానంచేయుట,మంచి ఆసనము మంచి చోట కూర్చొట్లను ఎప్పుడూ కోరదు, ఈ మానసపూజ శుద్ధమగు పానీయములతో, భోజనము, భోజనముతో తినదగు పదార్ధములను కోరదు,బ్రహ్మానికి వీటన్నింటితో పనిలేదు. 'ఈ పూజ ఎవరెవరు చేయవచ్చు?' భార్యాబిడ్డలు గలవారెవ్వరైనా ఏకులంవారైనా ఏవయస్సువారైనా ఈ మానస పూజను వశము చేసుకోవచ్చును. మానసారాధనకన్నమించిన గొప్ప మంత్రము లేవీ  లేవు. అలాంటి మంత్రములను కనిపెట్టినవారూ లేరు. అన్నిలోకములలో వాడుకలో లేనిది,రహస్యముగా ఉంచబడినట్టి విద్యను, నరలోకంలోని జనుల సాధన కొరకు నీవు అడిగావు కావున వినుము ఈ విద్యను సాధింపుము. 'ఈ పూజకు ఏమేమి కావాలి, ఎలా అర్చించాలి? ' ఎలాంటి రూపము, పేరు, ఎలాంటి పనులు లేనట్టిదగు మహాగొప్ప తేజస్సుతో వెలుగుచున్న జ్యోతికి, నేను చేయు ఉపచారములు, పూజలో చేయుపనులు శాశ్వతముగా నుండుగాక.  1.గొప్ప సముద్రములు, నదులు, ఉపనదులందలి గొప్ప జలములన్నీ నీకు అభిషేకముగా,  2. మట్టి, రాళ్ళు, చెట్లు, జంతువులు వీటితో కూడిన 14లో...

సొంటి చేసే మేలు

సర్వరోగ నివారిణి. మహా ఓషది శొంఠి. 👉అల్లం ను బాగా కడిగి సున్నపుతేటలో ముంచి ఎండబెడితే సొంఠిగా మారుతుంది. 👉 ఈ భూమి మీద ,  అనేక రోగాలను ధ్వంసం చేయగల మహా మహా మూలికలలో ఈ శొంఠి అనేది ఒకటి. 👉దీనిలోని అపూర్వమైన గుణాలను తెలుసుకున్న మన మహర్షులు దీని శక్తికి ఆశ్చర్యపోయి దీనికి మహా ఓషది అని అర్థం వచ్చేటట్లుగా విశ్వభేషజo అని సంస్కృతంలో  నామకరణం చేశారు 👉దీనిని లోనికి వాడిన తర్వాత ఇది శరీరం అంతా వ్యాపించి ప్రతి అవయవాన్ని మృదువుగా, లోపరహితంగా చేయడానికి తోడ్పడుతుంది. మానవునిలో జీవనశక్తిని ( వ్యాధినిరోధక శక్తి) వృద్ధి చేస్తుంది.  👉కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ ని తగ్గిస్తుంది. 👉మూత్రపిండ రోగాలను తగ్గిస్తుంది. 👉పురుషులకు వీర్యవృద్ధి చేస్తుంది. 👉శ్వాశ రోగాలను, ఉదరశూలాలను, దగ్గులను, హృదయ రోగములను, బోదకాలను, వాత రోగములను తగ్గిస్తుంది. 👉ఉదరములో గ్యాస్ ఎక్కువైనపుడు గుండెలో నొప్పి వస్తుంది. ఈ సమస్య కోసం పావు చెంచా శొంఠిపొడిని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే గ్యాస్ తగ్గిపోయి గుండెనొప్పి కూడా తగ్గుతుంది. 👉దోరగా వేయించిన శొంఠి పొడిని మేక పాలతో కలిపి సేవిస్తే విష జ్వరాలు తగ్గిపోతాయి. 👉ఒకవైపు...

గాయత్రీ దేవి

Image
పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండే వాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగాతీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి. దేవతలు కలతచెంది. బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై 'వరం కోరుకో' అన్నాడు. అతడు తనకు మృత్యువులేని జీవనం కావాలన్నాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. 'మరేదైనా వరం కోరుకో' అన్నాడు. అంతట, ఆ రాక్షసుడు "చతురాననా! మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కాని , శస్త్రాస్త్రాలచేత కాని, స్త్రీ పురుషులలో ఎవ్వరిచేత కాని, రెండు కాళ్ళు గల ప్రాణిచేత గాని, నాలుగు కాళ్ళ గల జంతువు చేతగాని, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేతగాని మరణం లేకుండా వరమి"మ్మని కోరాడు. బ్రహ్మ "తథాస్తు" అన్నాడు. బ్రహ్మ దత్త వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని ...

శ్రీ గాయత్రి దేవి.. మహాత్మ్యం - విశిష్టత

Image
*📚. ప్రసాద్ భరద్వాజ*   *గాయత్రి జయంతి సందర్భంగా మనము తెలుసు కోవాల్సిన ముఖ్యమైన విషయాలు* *🌻. ప్రార్ధన : 🌻* *ముక్తా విద్రుమ హేమ నీల ధవళచాయై ముఖైస్త్రీ క్షణైః* *యుక్తామిందు నిబద్ధరత్న మకుటామ్త త్వార్ధ వర్ణాత్మికామ్* *గాయత్రీం వరదా* *భయాంకుశ* *కశాశ్శుభ్రమ్కపాలం గదామ్* *శంఖం చక్రమధార విందం యుగళమ్హ సైర్వహం తీం భజేే* గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది – అవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపఈ రుద్రుడు ఉంటారని తెలుస్తోంది. అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజింపబడుతుంది. గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. శ్రీ ఆది శంకరులవారు గాయత్రీమాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (...

మూత్రపిండములలో రాళ్లు కరిగించు గొప్ప ఔషధ యోగములు

    *  కానుగ గింజలలోని పప్పు మూడు గ్రాములు తీసుకుని పొడిచేసి 60 మిల్లీలీటర్ల ఆవుపాలలో కలిపి లోపలికి తీసుకొనుచుండిన మూత్రపిండాలలోని రాళ్లు పడిపోవును .  *  యవాక్షరం , బెల్లం సమాన భాగాలుగా కలిపి రెండు గ్రాముల చొప్పున రోజుకొకసారి ఒక వారం నుంచి పదిరోజులపాటు తినిన రాళ్లు కరిగి పడిపోవును . దీనితో పాటు బూడిదగుమ్మడికాయ రసం కూడా వాడిన ఫలితం తొందరగా కనిపించును.  *  వేపాకు నీడలో ఎండించి కాల్చి భస్మం చేసి పూటకు ఒకటిన్నర గ్రాము చొప్పున ఒకరోజు నిలువ ఉంచిన నీళ్లతో కలిపి తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాయి కరిగిపోవును . రెండుపూటలా తీసికొనవలెను .  *  రణపాల ఆకు రసము 6 గ్రాములు కాచిన వెన్న 13 గ్రాములు కలిపి ప్రతినిత్యము తాగుచున్న రాళ్లు కరుగును.  *  పల్లేరు చూర్ణం ఒక స్పూన్ , కొండపిండి చూర్ణం ఒక స్పూన్ ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఉదయం మరియు సాయంత్రం తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాళ్లు నివారణ అగును.  *  పొద్దుతిరుగుడు పువ్వు చెట్టు వేర్లు పొడి 25 గ్రాములు తీసుకుని ఒక లీటర్ తియ్యటి మజ్జిగతో కలిపి తీసుకొనుచున్న రాళ్లు కరుగును.  *  ...

స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము

6. మోక్షానికి సాధనము : మోక్షం సాధించాలంటే తత్పరత్వము కావాలి. అది ఉంటే ఇతర సాధనలు ఏవీ అవసరం లేదు. 'తత్పరత్వము' అంటే - దానియందు శ్రద్ద, మోక్షాన్ని సాధించి తీరుతాను అనే పట్టుదల. సాధించాలి అనే తీవ్రజిజ్ఞాస. అది ఉన్నవాడికి, బుద్దిలోని నిర్మలత్వాన్నిబట్టి కొంచెం ముందు వెనుకలుగా ఫలితం లభిస్తుంది. బుద్దికి అనేక దోషాలున్నాయి. అవే పురుషార్థాలను నాశనం చేస్తాయి. అందువల్లనే మానవుడు సంసారబంధనాలలో పడిచిక్కుకుపోతున్నాడు. ఈ దోషాలలో ముఖ్యమైనవి.     1. గురువాక్యం మీద (శ్రద్ధ లేకపోవటం (అవిశ్వాసము)    2, కామవాసన 3. చిత్తమౌధ్యము.    1. అవిశ్వాసం ; ఇది రెండు రకాలు : 1) సంశయము, 2) విపర్యయము    మోక్షమున్నదో, లేదో అనేది సంశయం. మోక్షం లేనే లేదు అనేది విపర్వ్యయం. తత్పరత్వం రావాలంటే ఈ రెండూ ఉండకూడదు. ఇక్కడ నిశ్చయ జ్ఞానమే కావాలి. మోక్షమున్నది. అంతే అసలు తర్మమే అవిశ్వాసానికి మూలం. అందుకు తరాన్ని వదిలిపెట్టాలి. అప్పుడు నిశ్చయబుద్ది కలుగుతుంది. శాస్తాలయందు విశ్వాసం కలుగుతుంది.    2 కామవాసన : ఇదే ఐహిక వాంఛ. ఇహలోక సుఖాలమీద కోరికలున్నప్పుడు మోక్షంమీద అపేక్ష ఉండదు. అంద...

గురువు యొక్క ఆవశ్యకత

Image
• * యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ*  • *తస్యైతే కథితాహ్యర్థా ప్రకాశంతే మహాత్మనం * దేవునిపై ఎంతటిభక్తితత్పరత ఉంటుందో గురువుపైనా అంతటి భక్తి తన్మయత గల మహాత్మునికే నిగూఢమైన వేదార్థాలు కరతలామలకం అవుతాయి’ అని శ్రుతి వాక్యం. మానవజన్మ, మోక్షాపేక్ష, సద్గురుసేవ ఈ మూడూ దుర్లభమైనవని, ఈశ్వరుని అపారకరుణ వల్ల తప్ప ఇవి లభించవని ఆదిశంకరుల ‘వివేకచూడామణి’ చెబుతోంది.  ధనం కంటే బంధువులెక్కువ. వారి కంటే దేహం ఎక్కువ. దేహం కంటే ధర్మం ఎక్కువ. ధర్మం కంటే దేవుడు ఎక్కువ. దేవునికంటే సద్గురువు ఎక్కువ. ‘గురు’ అను రెండు అక్షరాలు అమృత సాగరం వంటివి. ఆ అమృత సాగరంలో మునకలు వేసినవారికి ఈ సృష్టి అంతా గురు రూపమే. మనసులో గురు ధ్యానం చేసేవాడు సర్వేసర్వత్రా పూజనీయుడవుతాడు. పరమ నిష్ఠా గరిష్ఠుడైనా సద్గురు సేవ చేయనిదే పునీతుడుకాడు. గురుబోధ కానిదే ద్వైతము తొలగదు. జ్ఞానము కలుగదు. ఆత్మసిద్ధికి గురువు అవసరమా? అన్న ప్రశ్నకు....  ‘బోధ, శ్రవణ, ధ్యానాదులకన్నా ఎక్కువగా గురువుయొక్క అనుగ్రహమే ఫలితానిస్తుంది. శక్తిమంతమైన మహర్షుల సన్నిధిలో దుర్బల మనస్కులు కూడా శక్తిమంతులవుతారు’ అని భగవాన్‌ ...